
కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత ఆడిన తొలి సిరీస్లోనే అతడిపై వేటు పడింది. భారత టీ20 జట్టు కెప్టెన్గా సూర్యను తప్పించిన యాజమాన్యం.. జట్టులోనూ అతడికి చోటు లేకుండా చేసింది. కెప్టెన్గా విజయవంతమైనా.. బ్యాటర్గా విఫలమైనందున 35 ఏళ్ల సూర్యకుమార్ను నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ గనుక మళ్లీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటితే తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు! దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ముంబై జట్టుకు సూర్య కెప్టెన్ కానున్నట్లు సదరు అధికారి సంకేతాలు ఇచ్చారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘మా జట్టులో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఈ ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారే కెప్టెన్గా వ్యవహరిస్తారు’ అని ఎంసీఏ అధికారి తెలిపారు. అయ్యర్.. అంచెలంచెలుగా ఎదిగి కాగా దేశవాళీ క్రికెట్ ముంబై తరఫున.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అత్యుత్తమంగా రాణించిన శ్రేయస్ అయ్యర్కు ఊహించని అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా భారత టీ20 జట్టులో చోటు కోసం పరితపించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనూహ్య రీతిలో ఏకంగా కెప్టెన్గా పునరాగమనం చేశాడు. టీమిండియాకు మూడో ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ స్థానాన్ని సెలక్టర్లు శ్రేయస్తో భర్తీ చేశారు. ప్రస్తుతం అతడు అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్తో బిజీ కానున్నాడు. కాగా 2024–25 సీజన్ ఫైనల్లో మధ్యప్రదేశ్ను ఓడించి శ్రేయస్ సారథ్యంలోని ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 14 నుంచి డిసెంబరు 6 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్
