
ఉత్తరప్రదేశ్ లో వింత నమ్మకం.. మహిషాసురుడు ఆవహించాడంటూ గడ్డి తింటున్న 70 ఏళ్లవ్యక్తి
ఉత్తరప్రదేశ్లో వింత నమ్మకం.. మహిషాసురుడు ఆవహించాడంటూ గడ్డి తింటున్న 70 ఏళ్ల వ్యక్తి! ఈ వార్తకు సంబంధించిన

ఉత్తరప్రదేశ్లో వింత నమ్మకం.. మహిషాసురుడు ఆవహించాడంటూ గడ్డి తింటున్న 70 ఏళ్ల వ్యక్తి! ఈ వార్తకు సంబంధించిన

ప్రపంచంలో మనం ఎప్పుడూ చూడని ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉంటే, మరికొన్ని వింత ఆకారాల్లో పెరుగుతాయి. ఇంకొన్ని చెట్లకు పండ్లు కాండానికే కాస్తాయి, మరికొన్ని చెట్ల కాండం రంగురంగులుగా కనిపిస్తుంది. ప్రకృతి సృష్టించిన ఇలాంటి అద్భుతమైన 5 రకాల చెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. బావాబాబ్ చెట్లు ప్రధానంగా ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి కాండం చాలా పెద్దగా, లావుగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే చెట్టు కాండం ఒక పెద్ద సీసాలా కనిపిస్తుంది. కరవు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు జీవించగలవు. వాటి కాండంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండటం ఇందుకు కారణం. బావాబాబ్ చెట్లు చాలా కాలం జీవిస్తాయి. కొన్ని చెట్లు వందల సంవత్సరాలు, మరికొన్ని వెయ్యి సంవత్సరాలకు పైగా జీవించినట్లు అంచనాలు ఉన్నాయి. డ్రాగన్ బ్లెడ్ ట్రీ యెమెన్కు చెందిన సోకోత్రా ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పై భాగంలో కొమ్మలు గొడుగులా విస్తరించి ఉంటాయి. అందుకే దూరం నుంచి చూస్తే ఇది పెద్ద గొడుగులా కనిపిస్తుంది. ఈ చెట్టును తొలిచినప్పుడు ఎర్రటి పదార్థం బయటకు వస్తుంది. దాని కారణంగానే దీనికి డ్రాగన్ బ్లెడ్ ట్రీ అనే పేరు వచ్చింది. అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో కనిపించే బ్రిస్టిల్కోన్ పైన్ చెట్లు వాటి వయసు కారణంగా ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే చెట్లలో ఒకటి. కొన్ని బ్రిస్టిల్కోన్ పైన్ చెట్లు వేల సంవత్సరాల వయసు కలిగి ఉంటాయి. మంచు, బలమైన గాలులు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి పెరుగుతాయి. కఠినమైన వాతావరణం కారణంగా వీటి ఆకారం కూడా సాధారణ చెట్లలా ఉండదు. కొమ్మలు వంకరగా, కాండం కొంత భాగం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. బ్రెజిల్లో కనిపించే జబుటికాబా చెట్టు చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ దీనికి పండ్లు

మంట తట్టుకోలేక నీళ్లలోనే వారంలో ఐదు రోజులు..! శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఒక విచిత్రమైన, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పదహారేళ్ల బాలుడి ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంటి నిండా అనియంత్రిత మంటలు రావడం వల్ల ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆ టీనేజర్ రోజంతా నీళ్లలోనే గడుపుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగా ప్రాంతానికి చెందిన ఇక్బాల్ షేక్ అనే 16 ఏళ్ల కుర్రాడు ఈ వింత పరిస్థితితో నరకయాతన అనుభవిస్తున్నాడు. వారంలో దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇతడు నీటిలోనే మునిగి తేలుతుంటాడు. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకుండా వరుసగా వారం రోజులు కూడా స్థానిక చెరువులోనే ఉండిపోతుండటం విశేషం. బాలుడి వింత ప్రవర్తన గురించి ఆరా తీయగా ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. నీటి నుంచి బయటకు రాగానే తన శరీరం అంతా విపరీతమైన మంట పుడుతుందని, ఆ తాపాన్ని భరించలేకపోతున్నానని ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం చెరువు నీటిలో ఉన్నప్పుడు మాత్రమే తనకు ఆ మంట నుంచి శమనం లభిస్తుందని చెబుతున్నాడు. గత ఐదేళ్లుగా ఇక్బాల్ జీవితం ఇలాగే సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. నిరంతరం నీటిలో ఉండటం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. చర్మం దెబ్బతిని వివిధ రకాల చర్మ వ్యాధులు వ్యాపిస్తుండగా, ఎడతెరిపి లేని జలుబు, తీవ్రమైన దగ్గు అతడిని వేధిస్తున్నాయి. అతని ప్రాథమిక వైద్యం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాధి మూలాలను గుర్తించి సరైన చికిత్స అందించడంలో అక్కడి వైద్యులు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరొకవైపు, పేదరికంలో ఉన్న ఇక్బాల్ కుటుంబానికి కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్థాయి లేదు