డీలిమిటేషన్ కువ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం.. అఖిలపక్షం భేటీలో విజయ్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించే ఏ ప్రయత్నాన్నైనా అధికారికంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ఎంపీలతో ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. రాబోయే 40- 50 ఏళ్ల వరకు ప్రజాప్రతినిధుల స్థానాల సంఖ్యలో మార్పును రాష్ట్రం భరించలేదని, అందుకే డిలిమిటేషన్ ప్రక్రియకు ఐక్యంగా 'నో' చెప్పాలని నాయకులు నిర్ణయించినట్లు వర్గాలు వెల్లడించాయి.డీలిమిటేషన్కు వ్యతిరేకం‘‘మేము డిలిమిటేషన్కు మద్దతు ఇవ్వం.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి విజయ్ చాలా మంచి అడుగు వేశారు.. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి సరైన అర్థం ఉండదు.. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను, హక్కులను కాపాడటానికి ముఖ్యమంత్రి తమ నిబద్దతను పునరుద్ఘాటించారు’’ అని కాంగ్రెస్ ఎంపీ జోషిమణి పేర్కొన్నారు.విజయ్కు కనిమొళి సవాల్అధికార టీవీకే కూటమికి చెందిన కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ తో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 19 మంది ఎంపీలు హాజరయ్యారు. అయితే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి.. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ప్రాధాన్యతలను ప్రశ్నిస్తూ కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్పై చర్యలు తీసుకోవాలని ఆయనకు సవాలు విసిరారు.మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర జలశక్తి మంత్రికి వ్యక్తిగతంగా సమర్పించేందుకు, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఎంపీలను పంపడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారా? అని కనిమొళి ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే ప్రస్తుత చట్టాన్ని సవరించడానికి ఎలాంటి ప్రతిపాదనలను కూడా వెల్లడించలేదు.పార్లమెంటులో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తగ్గించే లేదా దాని హక్కులను ప్రభావితం చేసే ఎలాంటి డీలిమిటేషన్