
దర్శన్ప్రియురాలు పవిత్ర మాజీ భర్త మృతి
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఎ1 నిందితురాలిగా బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో కస్టడీలో ఉన్న నటి పవిత్ర గౌడ జీవితంలో మరొక విషాదకర అధ్యాయం చోటుచేసుకుంది. ఆమె మొదటి భర్త సంజయ్ సింగ్ కన్నుమూసినట్లు సంచలన వార్త బయటకు వచ్చింది. అయితే, ఈ ఘోర విషాదం ఇటీవల జరిగింది కాదు. సుమారు 7 నుండి 8 నెలల క్రితమే రాజస్థాన్లో తుదిశ్వాస విడిచారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి పరిశ్రమ వర్గాలని, ప్రజలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంజయ్ సింగ్, పవిత్ర గౌడల బంధం వెనుక పెద్ద కథే ఉంది. వీరిద్దరి ప్రయాణం 2007-2008 కాలంలో ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ప్రారంభమైంది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి పీటల దాకా వెళ్లి ఇద్దరూ దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఖుషీ గౌడ అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే, మనస్పర్థలు మరియు వ్యక్తిగత విబేధాల కారణంగా వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో 2013లో వీరు అధికారికంగా విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత సంజయ్ సింగ్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారని సమాచారం. విడాకుల అనంతరం ఆయన మద్యపానానికి తీవ్రంగా బానిసయ్యారాని మీడియా వర్గాలు వెల్లడించాయి. విపరీతమైన ఆల్కహాల్ అలవాటు వల్ల ఆయన కాలేయ సంబంధిత వ్యాధులకు (లవర్ కాంప్లికేషన్స్) గురయ్యారు. బెంగళూరు వదిలి రాజస్థాన్కు వెళ్లిన ఆయన అక్కడ కొన్ని నెలల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స ఫలించక 7 నుంచి 8 నెలల కిందటే తన స్వస్థలంలో మరణించారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణ సమయంలోనే సంజయ్ సింగ్ పేరు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో పవిత్రతో తన గతాన్ని, 2013 నాటి విడాకుల వివరాలను ఆయన బహిరంగంగానే పంచుకున్నారు. ఆ తర్వాత సైలెంట్గా ఉండిపోయిన ఆయన మరణవార్త


