
రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడాబ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా
చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది. అయితే వీళ్లంతా సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ గ్రూప్ కు లీడర్ గా ఉండేవారు. పవన్ కూడా హీరో అవ్వకముందు చిరంజీవి ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారు. అప్పుడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, వీళ్లంతా చాలా చిన్న పిల్లలు కావడంతో పవన్ వారిని ఒక ఆట ఆడుకునేవారట బ్లాక్ మెయిల్ కూడా చేసేవారట. రీసెంట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఈవెంట్ ఒకటి జరిగింది. దానికి చిరంజీవి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈవెంట్ లో వరుణ్ చిన్ననాటి పోటో ఒకటి స్క్రీన్ పై చూపించారు. అందులో పవన్ కళ్యాన్ కాళ్లు పట్టుకుని వరుణ్ తేజ్ కనిపించారు. పవన్ అభయంఇస్తున్నట్టు కనిపించారు. ఈ ఫోటోగురించి మాట్లాడుతూ.. ''పవన్ బాబాయ్ ఏదో ఒక అవసరం కోసం ఇలా బ్లాక్ మెయిట్ చేసేవారు. డబ్బులు కావచ్చు.. ఏదైనా కావచ్చు..మేం కూడా ఏదో అవసరం కోసంమే అలా కాళ్లు పట్టేవాళ్లు.. అప్పుడు చాలా సరదాగా ఉండేది'' అని వరుణ్ తేజ్ అన్నారు. వరుణ్ ను మాత్రమే కాదు గతంలో రామ్ చరణ్ ను కూడా పవన్ కళ్యాణ్ ఇలానే బ్లాక్ మెయిల్ చేసేవారు. గతంలో ఈ విషయాన్ని ఇంటర్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు. పవన్-చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీరోలు కాకముందు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారట వీరు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాడు! ఇది నిజమే. కానీ ఈ సంఘటన చాలా రోజుల క్రింతం జరిగింది. అప్పటికి పవన్ సినిమాల్లోకి రాలేదు