
పాక్ లో 125 ఏళ్ల హిందూ ఆలయం కూల్చివేత.. భగ్గుమన్న మైనారిటీ సంఘాలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మదర్సా విస్తరణ కోసం మత ఛాందసవాదులు ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆలయాన్ని పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను స్థానిక అధికారులు ఖండిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే పాత నిర్మాణం కూలిపోయిందని చెబుతున్నారు.పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. లాహోర్కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 125 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని ఆగస్టు 21న నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ భూమిని, దానికి ఆనుకుని ఉన్న మదర్సాలో కలిపేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ ఘటనపై పాకిస్థాన్ మసిహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ) తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని తిరిగి నిర్మించాలని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఎంఎంపీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా మాట్లాడుతూ.. కూల్చివేసిన ఆలయానికి చెందిన ఇటుకలు, శిఖరానికి ఉన్న లోహపు సామాగ్రిని కూడా దుండగులు అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్
