
సింపుల్ గా, టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..? ఇదిగో సూపర్ రెసిపీ
భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాన, సాంబార్ ఒక సంప్రదాయ వంటకం. దీనిని ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్నం భోజనంలోనూ ఆనందిస్తారు. అనేక రకాల సాంబార్ వంటకాలు ఉన్నప్పటికీ, ఈ రెసిపీలో ఉల్లిపాయ, టమాటోను మాత్రమే ఉపయోగించి, సులభమైన పద్ధతిలో రుచికరమైన సాంబార్ను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం... ఇది ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. టమాటాలు: 2 చిన్నవి (పప్పు ఉడికించడానికి), 2 చిన్నవి (తరిగినవి), 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) ఉల్లిపాయలు: 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) కరివేపాకు: కొద్దిగా (మరిగించేటప్పుడు, పోపులో) పప్పు ఉడికించుకోవడం: ముందుగా 100 గ్రాముల కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దానిలోకి రెండు చిన్న సైజు టమాటాలను పొడవుగా కట్ చేసి వేయాలి. పప్పు తీసుకున్న గ్లాస్ తో రెండు గ్లాసుల నీరు పోసి, కుక్కర్లో మూత పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు చల్లారిన తర్వాత, మూత తీసి మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కూరగాయలు - మసాలాలు కలపడం: మెత్తగా మెదుపుకున్న పప్పులోకి పొడవుగా కట్ చేసిన మూడు చిన్న సైజు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన రెండు టమాటాలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉడికించడం: ఇప్పుడు దీనిలోకి అర కప్పు నీరు పోసి, మూత కొద్దిగా క్రాస్గా పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత, నిమ్మ సైజు చింతపండును నానబెట్టి తీసిన రసాన్ని సాంబార్లోకి కలపాలి. మీ రుచికి తగ్గట్టు పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీరు - సుగంధ ద్రవ్యాలు: తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు నీరు