
ఉద్యోగంతో అలసిపోతోంది
ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. కానీ అదే సమయంలో ఇంటి బాధ్యతల విషయంలో మాత్రం మహిళల పాత్ర మారడం లేదు. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి వస్తే.. ఇక్కడ మరో షిఫ్ట్లో ఉద్యోగం మొదలవుతుంటుంది. డిన్నర్కి ఏం చేయాలి? పిల్లలు హోంవర్క్ చేశారా? సరుకులు ఏం కొనాలి?.. వంటి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటి ఫలితంగా ఆధునిక మహిళ సాధికారత సాధించినా పనిభారంతో తీవ్రంగా అలసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలుగా మనం అలసిపోకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘టైమ్ యూజ్ సర్వే’ ఫలితాల ప్రకారం మహిళలు సగటున రోజుకి 4.81 గంటల సమయాన్ని ఇంటి పనులకు కేటాయిస్తున్నారట. అదే సమయంలో మగవారు మాత్రం కేవలం 1.46 గంటలే అందుకు వెచ్చిస్తున్నారట. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడానికి స్త్రీలు 2.28 గంటల సమయం కేటాయిస్తే.. పురుషులు మాత్రం 1.25 గంటల సమయాన్ని మాత్రమే వెచ్చిస్తున్నారట. ఈ సమయమంతా ఆఫీసు పనిగంటలకు అదనంగా ఉండడంతో వారు మానసికంగా, శారీరకంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఫలితంగా ఉద్యోగం చేసినంత మాత్రాన మహిళలకు పూర్తి స్వేచ్ఛ లభించడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నేళ్ల పాటు మహిళలను కేవలం ఇంటి పనులకే పరిమితం చేసేవారు. కాలక్రమేణా అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. తద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. అయితే చాలా కుటుంబాల్లో గతం తాలూకు సంప్రదాయాలు