శివమొగ్గలో అఘోర పూజలు, చేతబడులంటూ సీఎంవ్యాఖ్యలు... కోర్టుకు ఈడుస్తానన్న హరీశ్ రావు
శివమొగ్గలో అఘోర పూజలు, చేతబడులంటూ సీఎం వ్యాఖ్యలు... కోర్టుకు ఈడుస్తానన్న హరీశ్రావు సంగారెడ్డి ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, అల్లకల్లోలం సృష్టించడానికి కర్ణాటకలోని శివమొగ్గలో రహస్యంగా అఘోర పూజలు, చేతబడులు చేశారంటూ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారని.. హరీశ్ రావు ప్రజలను రెచ్చగొట్టడంలో నంబర్ వన్ అని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని తేల్చిచెప్పారు. ఈ వార్తకు సంబంధించిన