
లార్డ్స్ లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. ఆ ఆల్ టైమ్ రికార్డ్బ్రేక్.. తొలి భారతప్లేయర్ గా
Kranti Gaud Cricket Record: క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో భారత యువ సంచలనం క్రాంతి గౌడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఈ 22 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఐదు వికెట్లతో చెలరేగి వరల్డ్ రికార్డులను తిరగరాసింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని అందుకుని, దిగ్గజ ఆటగాడు జులన్ గోస్వామి పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును క్రాంతి గౌడ్ తుడిచిపెట్టేసింది. లార్డ్స్ పతాకంపై తొలి భారత మహిళా రత్నం..! లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల అధికారిక టెస్ట్ మ్యాచ్లోనే క్రాంతి గౌడ్ తన బౌలింగ్ పదును చూపించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను తన స్వింగ్, అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో కంగారు పెట్టిస్తూ 5/37తో కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది. లార్డ్స్ మైదానంలో ఏ ఫార్మాట్లోనైనా సరే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా క్రాంతి గౌడ్ రికార్డులకెక్కింది. ఈ అద్భుత ప్రదర్శనతో లార్డ్స్ పతాక బోర్డుపై ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇది కూడా చదవండి: బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్.. కేవలం 22 సంవత్సరాల 333 రోజుల వయసులోనే క్రాంతి గౌడ్ ఈ అద్భుత మైలురాయిని అధిగమించింది. గతంలో 2005లో ఢిల్లీ వేదికగా ఇంగ్లాండ్పైనే 22 సంవత్సరాల 361 రోజుల వయసులో ఐదు వికెట్లు తీసిన జులన్ గోస్వామి పేరిట ఉన్న రికార్డును క్రాంతి తాజాగా అధిగమించింది. తద్వారా టెస్ట్ క్రికెట్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్గా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ను చిత్తు చేసిన వండర్ కిడ్.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 285 పరుగులకు ఆలౌట్ కాగా