
డోంట్ ఆస్క్, డోంట్ టెల్'.. పిల్లల విషయంలో మెటా విధానం ఇదేనన్న మాజీ అధికారి
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా ఫెడరల్ కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇన్స్టాగ్రామ్ కార్యకలాపాల్లో పిల్లల భద్రతను పూర్తిగా విస్మరించి, కేవలం యూజర్ల సంఖ్య (గ్రోత్), వారి ఎంగేజ్మెంట్కే పెద్దపీట వేశారని కంపెనీ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ అర్తురో బెజర్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ మెటాపై పలు అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులో ఆయన సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది.మెటాలో ఉద్యోగుల పనితీరు, వారికి ఇచ్చే జీతభత్యాలు వంటివి పూర్తిగా ప్లాట్ఫామ్పై యూజర్లు ఎంత సమయం గడుపుతున్నారు, వారి సంఖ్య ఎంత పెరుగుతోంది అనే కొలమానాలపైనే ఆధారపడి ఉండేవని బెజర్ కోర్టుకు వివరించారు. "ఈ నేపథ్యంలో భద్రత అనేది చివరి ప్రాధాన్యతగా మిగిలిపోయింది" అని ఆయన స్పష్టం చేశారు. 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఇన్స్టాగ్రామ్ "డోంట్ ఆస్క్, డోంట్ టెల్" (అడగవద్దు, చెప్పవద్దు) అనే విధానాన్ని అనుసరించిందని, వారి ఉనికిని తెలిసి కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.ఇన్స్టాగ్రామ్ను 13 ఏళ్ల లోపు వయసున్న పదివేల మంది పిల్లలు వాడుతున్నారన్న విషయం కంపెనీలో చాలా మందికి తెలిసిన సాధారణ విషయమని బెజర్ పేర్కొన్నారు. నకిలీ ఖాతాలను గుర్తించడానికి మెటా వద్ద అధునాతన వ్యవస్థలు ఉన్నప్పటికీ, 13 ఏళ్ల లోపు పిల్లల వయసును గుర్తించి, వారిని నియంత్రించేందుకు ఉద్యోగులకు ఎలాంటి లక్ష్యాలు గానీ, కొలమానాలు గానీ లేవని ఆయన తెలిపారు. ఇది కంపెనీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు.2023లో కాలిఫోర్నియా, కొలరాడో సహా మొత్తం

