
ఐదు జిల్లాలకు భయంకరమైన గండం
అందమైన మంచు కొండలకు, పచ్చని లోయలకు పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు నిలువునా ముంచెత్తుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే ఈ పర్వత ప్రాంతం శతాబ్దపు అతిపెద్ద ప్రకృతి విపత్తును చూస్తోంది. ఆకాశానికి తూట్లు పడినట్లు కురుస్తున్న వర్షాలు, నిమిష వ్యవధిలోనే ఇళ్లను, రోడ్లను మింగేస్తున్న కొండచరియలు నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం దాదాపు 160 మంది బలయ్యారు. అనేక ఊళ్లకు దారులు మూసుకుపోగా, కనీసం తాగడానికి నీళ్లు, ఉండటానికి నీడ లేక స్థానికులు, పర్యాటకులు అల్లాడిపోతున్నారు. సుమారు రూ.886 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా అంచనా వేశాయి.శ్మశానాన్ని తలపిస్తున్న కుల్లు, మండి జిల్లాలువర్షాల ఉధృతికి రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కుల్లు, మండి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్వతాల పైనుంచి బురద నీళ్లతో కూడినండరాళ్లు విరిగిపడి ఇళ్లను, వాహనాలను తాత్కాలిక వారధులను కొట్టుకుపోయేలా చేశాయి. దాదాపు 259 ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసమవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రధానంగా కీలకమైన మండి-కుల్లు హైవే మూతపడటంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. మరోవైపు 161 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో వారానికి పైగా వందలాది గ్రామాలు గాఢ అందకారంలోనే మగ్గుతున్నాయి.AP Rain Alert: రేపు అల్పపీడనం- ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన..!జాడ లేని వందలాది మంది.. నిలిచిపోయిన తాగునీరుహిమాచల్లో జూన్ చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు నమోదైన నివేదికల ప్రకారం వరదలు, కొండచరియలు విరిగిపడి 68 మంది చనిపోగా, ఘాట్ రోడ్లలో జరిగిన ప్రమాదాల్లో మరో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. భయంకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ దాదాపు 257 మంది ఆచూకీ దొరకడం లేదు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నా.. ఎడతెరిపి లేని వానలు అడ్డంకిగా మారాయి. మరోవైపు 54కి పైగా తాగునీటి పథకాలు దెబ్బతినడంతో కొండ ప్రాంతాల్లో మంచినీటి చుక్క కోసం ప్రజలు మైళ్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి

