
గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్
థియేటర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాకేజ్డ్ మూవీ 'పంజా' జోరు కొనసాగుతూ ఉంది.ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడం, అవి కూడా ఫుల్ కావడం కూడా ఒక రికార్డు. డిజాస్టర్ మూవీకి ఈ స్థాయి క్రేజా అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 150కి పైగా షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం పవన్ మేనియాకు అద్దం పడుతోంది. నైజాం ఏరియాలో రీ రిలీజ్ మొదటి రోజే 1.2 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను సైతం షాక్కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 220కి పైగా స్క్రీన్లలో రిలీజవ్వగా ప్రతి థియేటర్ వద్ద 100% ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ రీ-రిలీజ్ హంగామా కేవలం థియేటర్ల లోపలే కాదు, బైట కూడా జాతరను తలపిస్తోంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు మరియు బాణసంచా కాల్పులతో థియేటర్ కాంప్లెక్స్లను పండగ వాతావరణంగా మార్చేశారు. ‘పాప రాయుడు’ పవర్ ఫుల్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ మేజర్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ చేస్తున్న విజిల్స్, కేకలతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. కాలం మారినా, ఏళ్లు గడిచినా 'జై' రోల్ లో పవన్ ప్రదర్శించిన రోల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పడానికి రీ రిలీజ్ ఒక ఉదాహరణ. 2011 డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్తో విడుదలైన ‘పంజా’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించలేకపోయింది. అయితే, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ విజువల్స్, యువన్ శంకర్ రాజా అందించిన ఐకానిక్

