
వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త
ఎండకాలం తర్వాత వచ్చే వర్షాకాలం ఎంతో హాయిని ఇస్తుంది. అయితే ఈ సీజన్లో ఆరోగ్యం విషయంలో కాస్త అలర్ట్గా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్ లేదా కీటకాలు చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే ఈ సమయంలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, గ్యాస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ కాస్త బలహీనంగా పనిచేస్తుంది. అందువల్ల ఎప్పుడూ పరిశుభ్రమైన, తాజా, తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సీజన్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు గమనిస్తే.. పాలకూర, మెంతి కూర, బతువా వంటి ఆకుకూరలు శరీరానికి చాలా మంచివి. వీటిలో ఐరన్, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రక్తం పెరగడానికి సహాయపడతాయి. అయితే వర్షాకాలంలో ఈ ఆకుకూరలపై మట్టి, చిన్న చిన్న పురుగులు, మురికి ఎక్కువగా అంటుకుని ఉంటాయి. తేమ వల్ల వీటిపై కీటకాలు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలను తినాలనుకుంటే, వాటిని చాలా శుభ్రంగా కడిగి, బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. సగం ఉడికిన లేదా సరిగ్గా కడగని ఆకుకూరలు తింటే కడుపు సమస్యలు తప్పవు. వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, చాట్, గోల్ గప్పా, ఇతర తెరిచి ఉన్న ఆహార పదార్థాలను తినడం అస్సలు మంచిది కాదు. బయట కప్పి ఉంచకుండా ఉంచే ఆహారంపై ఈగలు వాలడం, దుమ్ము ధూళి పడుతుంది. దీని వల్ల ఆహారంలోకి క్రిములు చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది కడుపు పాడవడానికి, వాంతులు లేదా విరేచనాలకు దారితీస్తుంది. కాబట్టి పండ్లను ఇంటికి తెచ్చుకుని, నీటితో బాగా కడిగిన తర్వాతే తినాలి. వర్షాకాలంలో ఐస్క్రీమ్లు, చల్లని డ్రింక్స్