
సంపులో మహిళ మృతదేహం.. రూ.10 వేల కోసం హత్య
హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతురాలు కమలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ యజమాని ప్రకాష్.. నగదు, బంగారు కమ్మల కోసం కమలమ్మను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. కమలమ్మ జీతం తీసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ ఆమెను తన షాపులోకి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ షాపులోకి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే షాపులోకి వెళ్లిన అనంతరం ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కమలమ్మ వద్ద ఉన్న రూ.10 వేల నగదు, అర తులం బంగారు కమ్మల కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్
