
నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ! ఈ వార్తకు సంబంధించిన

నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ! ఈ వార్తకు సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కింద నైపుణ్య శిక్షణ అందించనుంది. ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కోచోట 50 మంది చొప్పున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడత 100 రోజుల పాటు శిక్షణ అందించనుండగా.. త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభం కానుంది.ఇజ్రాయెల్లో హోమ్ బేస్డ్ కేర్గివింగ్కు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఉద్యోగాల కోసం ఏఎన్ఎం/జీఎన్ఎం,బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలు మాత్రమే అర్హులు. ఇజ్రాయెల్లో ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన శిక్షణ అందిస్తారు. వీరికి కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉన్న పాస్పోర్ట్ ఉండాలి. అంతేకాదు గతంలో ఇజ్రాయెల్లో పనిచేసి ఉండకూడదు. అభ్యర్థుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు ప్రస్తుతం ఇజ్రాయెల్లో నివాసం, ఉద్యోగం చేస్తుండకూడదు.రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ తీసుకునేలా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో ఈ శిక్షణా కేంద్రాలు ప్లాన్ చేశారు. శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురంలలో ఇతర వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణా కేంద్రాల కోసం ఎంపిక చేశారు. ఈ శిక్షణా కేంద్రాల్లో ఎస్సీ మహిళలతో పాటు పురుషులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు జర్మనీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ యువత కోసం ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు మూడు నెలల పాటూ శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి సర్టిఫికెట్ కూడా అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంతేకాదు వారు

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో లోక్ భవన్ భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. దీనికోసం 212. 22 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఇదివరకే అనుమతులు ఇవ్వగా.. తాజాగా ప్రభుత్వం దీనికి తుది ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రభుత్వ నిర్మాణాలను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నూతనంగా నిర్మించబోయే ఈ లోక్ భవన్ సముదాయంలో అత్యున్నత స్థాయి వసతులను కల్పించనున్నారు. ప్రధానంగా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, కార్యాలయం, రెండు అతిథి గృహాలు ఇందులో నిర్మితం కానున్నాయి. అలాగే.. లోక్ భవన్ అధికారులు, సహాయక సిబ్బంది కోసం క్వార్టర్లు కూడా ఈ కాంప్లెక్స్ పరిధిలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో ఆఫీసర్ క్వార్టర్స్- 6, సీనియర్ స్టాఫ్ క్వార్టర్స్- 10, జూనియర్ స్టాఫ్ క్వార్టర్స్- 12, సహాయక సిబ్బంది క్వార్టర్స్- 40 ఉంటాయి. 20 గదులతో కూడిన బ్యారక్స్ నిర్మితం కానున్నాయి. ఇందులో దాదాపు 144 మంది రక్షణ సిబ్బందికి వసతి కల్పిస్తారు. నాలుగు సెంటినల్ పోస్టులతో కూడిన కాంపౌండ్ వాల్, ఇతర అనుబంధ చెక్ పాయింట్స్ కూడా ఈ నివాస సముదాయం పరిధిలో నిర్మించనున్నారు. ఆర్సీసీ పద్ధతిలో అత్యాధునిక ప్రమాణాలతో ఈ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఈ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ.. ఆర్థిక శాఖ కొన్ని షరతులను విధించింది. నిర్మాణ వ్యయం మొత్తం కూడా రూ. 212.22 కోట్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. దీనిలోపే నిర్మాణం పూర్తి కావాల్సి ఉంటుంది. దీనికి మించి ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపడానికి వీల్లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికి అయ్యే మొత్తం వ్యయాన్ని సీఆర్డీఏ భరించాల్సి ఉంటుంది. తన వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుంచే సర్దుబాటు చేయాలని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అవయవ దానంపై మరింత అవగాహనను కల్పిద్దామని పేర్కొన్నారు. దాతలుగా మారడానికి అవగాహనతో కూడిన నిబద్ధతను కనబరిచేలా ఎక్కువ మంది పౌరులను ప్రేరేపిద్దామని తెలిపారు. ఒకరి జీవితాన్ని పొడిగించలేనప్పుడు, మరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా దానికి కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి దానం ఒక ఆశకు వాగ్దానంగా మారేలా, ప్రతి దాత చిరకాలం నిలిచిపోయే వారసత్వాన్ని వదిలి వెళ్లేలా మనం ఉదారత సంస్కృతిని నిర్మిద్దామని తెలిపారు. జీవితాన్ని దానం చేయాలని.. ఆశను ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఓ ఆసుపత్రిలో రాజలక్ష్మి ఒకే కాన్సులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. వివరాలు.. మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి, నరేందర్ దంపతులు. తొలిసారి గర్భం దాల్చిన రాజ్యలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో సోమవారం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయగా, ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువుల బరువు తక్కువగా ఉండడంతో పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు జన్మించడంతో రాజలక్ష్మి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను నిందిస్తే ఊరుకోను BCCIకి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్ బయటపడ్డ TDP ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు