వామ్మో.. రోజుకు రూ.8300 కోట్ల సంపాదన! ఒక్క ఏడాదిలో ఎలాన్ మస్క్ ఆస్తి ఎంత పెరిగిందంటే
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆస్తుల విలువలో హెచ్చుతగ్గులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ ఏడాది 2026, జూన్ నెలలో స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ (Trillionaire) గా అవతరించి రికార్డ్ సృష్టించిన మస్క్, ఆ తర్వాతి కాలంలో షేర్ల విలువ పడిపోయి ఆ హోదాను కోల్పోయారు. అయినప్పటికీ గడిచిన ఏడాది కాలంలో భారీగా సంపద పెంచుకున్నారు. గత ఏడాది 2025 జులై నుంచి ప్రతి రోజూ సగటున దాదాపు రూ.8300 కోట్ల చొప్పున సంపాదిస్తూనే ఉన్నారు.2025 జులై నుంచి 2026 జులై మధ్య కాలంలో ఎలాన్ మస్క్ సంపద 320 బిలియన్ డాలర్లుఅంటే భారత కరెన్సీలో దాదాపు రూ.30 లక్షల కోట్లు పెరిగింది. 2026, జూన్ 12వ తేదీన స్పేస్ ఎక్స్ మార్కెట్లోకి అడుగు పెట్టిన సమయంలో మస్క్ ప్రపంచానికి తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు) అంటే భారత కరెన్సీలో దాదాపురూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నారు. అయితే, గత నెలలో స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పడిపోవడంతో ఆ స్థానాన్ని కోల్పోయారు. అయినా ప్రపంచ కుబేరుల్లో కొనసాగుతున్నారు.గత ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీలో వేగవంతమైన వృద్ధి కనిపించింది. ఈ కారణంగా ఎలాన్ మస్క్ సహా మైఖేల్ డేల్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ గియాన్ కార్లో వంటి పారిశ్రామికవేత్తల సంపద ఊహించని విధంగా పెరిగింది. మస్క్ తర్వాత భారీగా సంపద పెరిగిన వారిలో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ ఉన్నారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద 107.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక డీప్ సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ సంపద 39.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దాంతో టాప్ 50 అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు.మస్క్ ప్రస్తుత ఆస్తి
