
గుడ్ల ధరలకు 'ఈ20' సెగ.. ఏడాదిలో 40 శాతం పెరిగిన రేట్లు
దేశంలో కోడిగుడ్ల ధరలు సామాన్యులకు భారాన్ని కలిగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు ఏకంగా 35 నుంచి 40 శాతం వరకు పెరిగాయని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) వెల్లడించింది. ఇటీవలి వరకు ఫామ్ వద్దే ఒక్కో గుడ్డు ధర రూ. 7 ఉండగా, రిటైల్ మార్కెట్లో అది రూ. 8 నుంచి రూ. 9కి చేరింది. రాబోయే శీతాకాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఈ20' ఇంధన విధానమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలన్న లక్ష్యంతో మొక్కజొన్నను భారీగా వినియోగిస్తున్నారు. కోళ్ల దాణా తయారీ వ్యయంలో 65 నుంచి 70 శాతం మొక్కజొన్నదే కావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో దాదాపు 37 శాతాన్ని ఇథనాల్ తయారీ పరిశ్రమలకే మళ్లించడంతో, కోళ్ల పరిశ్రమకు దాణా కొరత ఏర్పడి ధరలు గణనీయంగా పెరిగాయి.గత మూడేళ్ల కాలంలో టన్ను మొక్కజొన్న ధర రూ. 14,000 నుంచి రూ. 26,500కి పెరిగింది. ముఖ్యంగా గత ఐదు నెలల్లోనే ధరలు 20 శాతం పెరగడం గమనార్హం. 2024లో 6 మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి వినియోగించగా, ప్రస్తుతం ఆ వినియోగం 17 మిలియన్ టన్నులకు చేరింది.ఇథనాల్ విధానంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాల రేటు పెరగడం వంటివి కూడా ఇటీవల ధరల పెరుగుదలకు ఇతర కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు