ఆ అమ్మాయికి సెకండ్హ్యాండ్ కారు గిఫ్ట్ గా ఇస్తే ఏడ్చి సస్తున్నరు
జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్, బీజేపీ మహిళా నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్గా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అర్వింద్కు శ్రావణి రాఖీ కట్టగా.. సోదరి భావంతో రాఖీ కట్టినందుకు కానుకగా తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కార్లలో ఒకదానిని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో జగిత్యాల జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడుతున్న పాత నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన శ్రావణికి ఎంపీ అర్వింద్ ప్రాధాన్యం ఇవ్వడంపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.శ్రావణికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కడాన్ని తట్టుకోలేని జగిత్యాల బీజేపీలోని ప్రత్యర్థి వర్గం ఎంపీ అర్వింద్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని, శ్రావణికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మిగతా నేతలను విస్మరిస్తున్నారంటూ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కారు గిఫ్ట్ వ్యవహారంపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఓ యూట్యూబ్ జర్నలిస్ట్తో ఫోన్కాల్లో మాట్లాడిన ఆయన.. ఇది చాలా చిన్న విషయమని దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.'ఆ అమ్మాయి మున్సిపల్ ఛైర్మన్ పదవిని వదులుకొని బీజేపీలో జాయిన్ అయ్యింది. పద్మశాలి అమ్మాయి.. యంగ్స్టర్ కాబట్టి ఏడెనిమిది నెలలు బతిమిలాడుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ చేయించుకున్నా. ఆ ప్రభావంతో జగిత్యాలలో 45 వేల ఓట్లు వచ్చినయ్. లేకుంటే చరిత్రలో 3,4 వేలకు దిక్కులేదు. కారు గిఫ్ట్ ఇవ్వటం అనేది రాజకీయం కాదు. ప్రేమతో ఆశీర్వాదం అన్నట్లుగా ఇచ్చా. నా కార్యకర్తల కోసం చాలా చేశా. కార్యకర్తలకు కోట్లలో ఖర్చు పెట్టా. అది మా డాడీకి నేను కొనిచ్చిన కారు. ఆయన కాలం చేశాక.. అది అలా మూలన పడి ఉండటం