
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు
Palvancha: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Palvancha: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ బహిష్కరణ - మాదిగ నేతలు ఈ వార్తకు సంబంధించిన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సభకు దూరంగా ఉండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను చర్చించేందుకు శాసనసభే అత్యంత కీలకమైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఒక పార్టీ నిర్ణయించుకోవడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు సభకు వచ్చిన చంద్రబాబు, అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ వరుసగా సమావేశాలకు గైర్హాజరవుతున్న విషయంపై తొలిసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల ద్వారా సభలో ప్రస్తావించాలని ఆశిస్తారని, అలాంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్షం సభకు రాకపోవడం సరైన విధానం కాదని అన్నారు. ప్రతిపక్షానికి కొన్ని రాజకీయ అభ్యంతరాలు ఉన్నప్పటికీ వాటిని అసెంబ్లీ వేదికగానే ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. బయట సమావేశాలు నిర్వహించడం, మీడియా ముందు మాట్లాడటం ద్వారా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించేందుకు, ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు శాసనసభ సరైన వేదికగా ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేలుగా ప్రజల నుంచి మద్దతు పొందిన నేతలు సభకు హాజరై తమ బాధ్యతను నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు గతంలో ప్రతిపక్షాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించిన పరిస్థితులు అరుదని చెప్పారు. 1978లో జైపాల్ రెడ్డి (Jaipal Reddy), వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) వంటి నేతలు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న సమయంలోనూ శాసనసభలో చర్చల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే 1989-91 మధ్య ఎన్టీ రామారావు (N. T. Rama Rao) సభకు హాజరుకాని సందర్భాల్లో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా

అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్చాట్ చేశారు. బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని సీఎం ఉద్ఘాటించారు. అలాంటి వేదికను ఓ పార్టీ మొత్తం బహిష్కరించటం తన రాయజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తెలిపారు 1978లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారని ప్రస్తావించారు.1989 నుంచి1994 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాడామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకూ పోరాటం వదల్లేదని అన్నారు. గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా?.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాళ్లు చేసిన పోరాటమే అందరినీ ఆలోచింప చేసిందని సీఎం చెప్పారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది అసెంబ్లీలో వారి సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనే అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చోని డీఎస్సీపై వైసీపీ సభ్యులు బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. అయితే, వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.మరోవైపు, ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికారపక్షం తన వాదనను వినిపించనుంది.స్పీకర్ ఆహ్వానం.. వైసీపీ తిరస్కరణసమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వాణిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించి, తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం.మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా రాజమంత్రి ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షా కాల సమావేశాలలో ప్రజా సమస్యలపై గళం వినిపించడానికి తనకు బెయిలు మంజూరు చేయాలని కోరడం ఇప్పుడు రాజకీయవర్గాలలోనే కాకుండా జన బాహుల్యంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి, తన నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్ లో అభ్యర్థించారు, డిసెంబర్ 2021 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత బాబు.. గతంలో సభలో ప్రజా సమస్యలపై ఎంతవరకు గళమెత్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన వినిపిస్తున్న వాదన విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే బెయిల్ కావాలని ఆయన అడుగుతుంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. కేవలం జైలు నుంచి బయటకు రావడం కోసమే ప్రజా సమస్యల నెపంతో బెయిల్ డ్రామాలు ఆడుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అనంతబాబు మండలిలో గళమెత్తిన సందర్భాలు దాదాపు మృగ్యమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతారని నిలదీస్తున్నారు. మొత్తం మీద అనంతబాబు బెయిలు పిటిషన్ ఇప్పుడు పొలిటికల్
.webp)
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..! ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణ వేళ రాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ శాసనసభాపక్ష (వైసీపీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. చట్టసభల్లో ప్రతిపక్షంగా తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితోనే శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ, శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) సమావేశాలకు మాత్రం విధిగా హాజరుకావాలని వైఎస్సార్సీపీ తీర్మానించింది. మండలి వేదికగానే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ప్రజా సమస్యలపై నిలదీయాలని నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అదేవిధంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా వైఎస్సార్సీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ కీలక వర్గాలు స్పష్టం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి నడుమ తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చట్టప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్సార్సీపీ నాయకులు మొదటి నుంచీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, శాసనసభలో సంఖ్యాబలం ప్రకారం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని అధికార పక్షం తేల్చిచెబుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీని బహిష్కరించి, తమకు మెజారిటీ ప్రాతినిధ్యం ఉన్న శాసనమండలి వేదికగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. వైఎస్సార్సీపీ వైఖరిపై అధికార కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా సభను బహిష్కరించడం

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టార్చ్లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్ తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!