
ఇరుముడిలో ఏముంటాయి? ఇరుముడికి అయ్యప్పకు సంబంధమేంటి? అసలు సీక్రెట్ ఇదే
అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పంబ నుంచి శబరిమల కొండపైకి వెళ్లే భక్తులు తప్పనిసరిగా తలపై పవిత్రమైన మూటను ధరిస్తారు. దాన్నే ఇరుముడి లేదా ఇరుముడి కట్టు అంటారు. మలయాళంలో "ఇరు" అంటే రెండు, "ముడి" అంటే మూట లేదా కట్టు అని అర్థం. ఈ ఇరుముడి అనేది కేవలం పూజా సామగ్రిని తీసుకెళ్లే ఒక సంచి మాత్రమే కాదు. ఇది 41 రోజుల పాటు కఠినంగా ఉండే అయ్యప్ప స్వామి దీక్ష, నెయ్యాభిషేకం, పవిత్ర 18 మెట్లతో బలమైన సంబంధం కలిగిన అత్యంత ఆధ్యాత్మిక ప్రతీక. శబరిమల ఆలయ అధికారిక వివరాల ప్రకారం, ఇరుముడి సంప్రదాయం వెనుక మణికంఠుడు పులి పాలు తీసుకురావడానికి అడవికి వెళ్లిన కథ దాగి ఉంది. నాటి ప్రయాణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఇరుముడిని తలపై మోస్తూ పంపా నదిలో స్నానం చేసి శరణఘోషతో కొండ ఎక్కుతారు. ఇరుముడి సంకల్పాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో మొదటిది దైవిక భాగం కాగా, రెండోది భక్తుని స్వంత అవసరాల కోసం ఉపయోగపడేది. ఇందులో స్వామివారికి సమర్పించే పవిత్ర వస్తువులు ఉంటాయి. పీచు తీసిన కొబ్బరికాయకు పైన రంధ్రం చేసి, అందులోని నీటిని పూర్తిగా తీసేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నింపుతారు. దీనినే నెయ్య్ తేంగా (నెయ్యి కొబ్బరికాయ) అంటారు. ఇది శబరిమలలో అయ్యప్ప స్వామికి చేసే నెయ్యాభిసేకానికి చాలా ప్రధానమైనది. దీనితో పాటు పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, ధూప్స్టిక్స్, విభూతి, ఆవు నెయ్యి వంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి. అలాగే నైవేద్యం కోసం బెల్లం, కండచక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పేలాలు, అటుకులు, తమలపాకులు, వక్కలు, నాణేలు సహా ఇతర కానుకలు ఉంచుతారు. ఈ భాగంలో భక్తుడు అంటే స్వామి యాత్రలో తన ఆహారం కోసం తీసుకెళ్లే బియ్యం, పప్పు ధాన్యాలు, ఇతర తినుబండారాలు, వ్యక్తిగత పూజా సామగ్రిని భద్రపరుచుకుంటారు. శబరిమలలో జరిగే నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి అత్యంత ముఖ్యమైన పూజా