నిమిషం•Telangana•13 ఆగ
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈప్రాంతాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు, మిడిల్, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణ వ్యవస్థ వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ వైపు కదిలింది. రాబోయే గంటల్లో ఇది గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతుండటంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో కొన్ని చోట్ల ఏకంగా 204.5 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చు. ఇక జార్ఖండ్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులు మునిగిపోయి రవాణాకు ఆటంకం కలగడం, నదులలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. కేవలం తూర్పు ప్రాంతాలే కాకుండా దేశంలోని మరో 15కు పైగా రాష్ట్రాలు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, కేరళ, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్లోని కొన్ని భాగాలు, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ ఎంపీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రుతుపవన ద్రోణి చురుకుగా ఉండటంతో పాటు పశ్చిమ అవాంతరం కూడా తోడవడంతో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల