
విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త
భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీ జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఒకరు. పబ్లిక్ అటెన్షన్ నుండి దూరంగా ఉండాలని ఈ జంట భావించింది. తమ పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వారు లండన్ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2025లో డాక్టర్ శ్రీరామ్ నేనే, అనుష్కా శర్మతో జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఆమె తన విజయాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఆ సమయంలో పంచుకున్నారు. ఈ పాత సంభాషణ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వీరు తమ పిల్లలు వామికా, అకాయ్లతో కలిసి లండన్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనుష్క శర్మతో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే 2025లో యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విరాట్ కోహ్లీని ఎంతో వినయంతో ఉండే వ్యక్తిగా ఆయన ప్రశంసించారు. అనుష్కతో జరిగిన మాటలను గుర్తుచేసుకుంటూ, విపరీతమైన ప్రజాదరణ వల్ల సాధారణ జీవితం గడపడం ఎంతో కష్టంగా మారిందని ఆమె భావించినట్లు డాక్టర్ నేనే వివరించారు. వారు సాధించిన విజయం వల్ల వచ్చే నిరంతర దృష్టి వారి స్వేచ్ఛకు అడ్డంకిగా మారింది. విరాట్, అనుష్క ఇద్దరి కెరీర్లు అపారమైన విజయాన్ని చూశాయి. అయితే దానితో పాటే వారి వ్యక్తిగత జీవితం కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి, ప్రయాణాలు, పిల్లల జననం వంటి ప్రతి చిన్న విషయం అభిమానులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటువంటి వాతావరణం నుండి దూరంగా ఉండి, పిల్bబాల్యం అందించడమే ఈ జంట లండన్ జీవితాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వారి పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నది. 2017లో ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్