
బలూచిస్థాన్ లో పాక్ దాడులు.. జోక్యం చేసుకోవాలంటూట్రంప్ కు బలోచ్ నేతల లేఖ
బలూచిస్థాన్లో పాకిస్థాన్ సైన్యం ఇటీవల జరిపిన వైమానిక దాడుల ఘటన తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారా చంద్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని, వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. పాకిస్థాన్ దుశ్చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఆగస్టు 12వ తేదీ తెల్లవారుజామున సురబ్ జిల్లాలోని గిదర్ ప్రాంతంలో నివాస గృహాలపై పాకిస్థాన్ వైమానిక దళం విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించిందని, ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని బలోచ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తారా చంద్ రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. "ఈ తీవ్రమైన ఆరోపణలపై మీ ప్రభుత్వం విచారణ జరపాలి. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన విమానాలు, ఆయుధాలు, డ్రోన్లు, టెక్నాలజీ లేదా ఇతర సైనిక పరికరాలు ఏమైనా ఉపయోగించారా? అనే విషయాన్ని నిర్ధారించాలి. ఒకవేళ అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభిస్తే, పాకిస్థాన్కు అందిస్తున్న సైనిక సహాయంపై సమీక్ష జరపాలి" అని ఆయన కోరారు.అంతేకాకుండా అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిన ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు అమెరికా మద్దతు ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని తారా చంద్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. "అధ్యక్షా.. ప్రపంచంలో ఏ చిన్నారి ప్రాణమైనా
