
Nanded Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
© 2026 nimisham.in

Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్

Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇన్చార్జి ఏఈవో మృతి

ACB Raids | మెడికల్ రీయింబర్స్మెంట్ చెక్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగులు

Michael Jackson కట్టిన మాయా ప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు నటి అర్చన (Archana ) సైతం తన ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి మహేశ్వరి (Maheshwari) సైతం తన కుటుంబం ఫోటోలను AIలో 80s స్పెషల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.

Palawan Ferry Accident : ఫిలిప్పీన్స్లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 87మంది ఆచూకీ గల్లంతైంది

ఏడు వారాల జైలు జీవితంలోనే బాధితుడు ఏకంగా 21 కిలోల బరువు తగ్గడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడాన్ని కోర్టు(Bombay High Court) తీవ్రంగా పరిగణించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నటి దివి కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Heart Attack | మహిళల్లో గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. ఇవి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..

సీరియల్ నటి కావ్యశ్రీ తాజాగా ఓ షో కోసం ఇలా అందంగా ముస్తాబయి మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Fire Accident | పెళ్లి పార్టీలో అగ్నిప్రమాదం.. 22 మంది దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి.. రీసెంట్గా అమ్మతో కలిసి కాశీ వెళ్లింది. అక్కడి ఘాట్స్లో తిరిగింది. తన పుట్టినరోజుని కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

ఫారెన్ వెడ్డింగ్కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్! మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా? మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి? Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది. రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే : ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్. ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. 2018లో విడుదలైన 'పద్మావత్' చిత్రంలోని 'జోహార్' (సామూహిక ఆత్మాహుతి) ఘట్టాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కర్ణిసేన వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వర భాస్కర్, శత్రువుల చేతిలో చిక్కకుండా ఉండేందుకు ఆత్మాహుతి చేసుకోవడాన్ని గొప్పగా చిత్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఆత్మహత్య చేసుకోకపోతే నన్ను నేను పిరికిదానిలా భావించాలా? అత్యాచార ఘటనలు పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో బాధితులకు మనం ఇలాంటి సందేశమే ఇవ్వాలనుకుంటున్నామా?" అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను రాణి పద్మావతిని ఉద్దేశించి 'పిరికిపంద' అనే పదాన్ని వాడలేదని ఆమె వివరణ ఇచ్చారు.ఈ వివాదంపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. స్వర భాస్కర్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. మహిళలు తోటి మహిళలను గౌరవించుకోవాలని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోవైపు, హిందూ సమాజాన్ని, రాజపుత్ర మహిళలను కించపరిచారంటూ బీహార్కు చెందిన బీజేపీ నేత కృష్ణ కుమార్ సింగ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.కర్ణిసేన సైతం స్వర భాస్కర్ను తీవ్రంగా హెచ్చరించింది. "హిందూ యోధురాళ్లను, వారి అత్యున్నత త్యాగాలను అవమానిస్తే కర్ణిసేన ఎప్పటికీ క్షమించదు" అని ఆ సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు కీర్తి రాథోడ్ స్పష్టం చేశారు. కేవలం హిందూ సంప్రదాయాలను
కరీంనగర్లో బావిలోకి దూసుకెళ్లిన RTC బస్సు.. బయటపడ్డ 54 మంది ప్రయాణికులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మూడు రోజుల క్రితమే రిపేర్ చేయించినా ఇలా జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వార్తకు సంబంధించిన

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీ అక్రమాలు బట్టబయలయ్యాయి. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఒక జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఘటనపై పాఠశాల డైరెక్టర్కు నివేదిక అందజేస్తామని కర్నూలు డీఈవో తెలిపారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన

కిచెన్ అల్మారాలో పాత కార్డుబోర్డులతో ఆర్గనైజర్లు తయారుచేయవచ్చు. మసాలా ప్యాకెట్లు, సాస్ ప్యాకెట్లు, టీ-కాఫీ పొడులు, చిన్న డబ్బాలు.. ఇందులో పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే పాత కార్డ్బోర్డ్ పెట్టెనే అందమైన, ఉపయోగపడే ఆర్గనైజర్గా మార్చేయొచ్చు. ముందుగా, మరీ పాడవ్వకుండా శుభ్రంగా, పొడిగా ఉన్న ఒక కార్డ్బోర్డ్ పెట్టెను తీసుకోండి. మీరు ఆర్గనైజర్ను పెట్టాలనుకుంటున్న అల్మారా లేదా డ్రాయర్ పొడవు, వెడల్పు కొలిచి, దానికి సరిపోయే పెట్టెను ఎంచుకోండి. పెట్టెను తీసుకున్నాక, ముందుగా దాని పై మూతలను, అవసరం లేని పొడవాటి భాగాలను కట్ చేసి తీసేయండి. ఉదాహరణకు, సుమారు 15–20 సెం.మీ. ఎత్తులో ఓపెన్ బాక్స్లా ఉంటే, లోపల వస్తువులను చూడటం, తీయడం సులభంగా ఉంటుంది. మీ అల్మారా ఎత్తును బట్టి ఈ సైజును మార్చుకోవచ్చు. ఇప్పుడు పెట్టె నాలుగు వైపులా ఒకే ఎత్తులో ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఎత్తుగా ఉంటే, పెన్సిల్తో గీత గీసి, ఆ పై భాగాన్ని కట్ చేయండి. కట్ చేశాక అట్ట అంచులు పదునుగా ఉంటే, వాటిపై ప్యాకింగ్ టేప్ లేదా పేపర్ టేప్ చుట్టండి. దీనివల్ల వస్తువులు తీసేటప్పుడు చేతికి గీతలు పడకుండా ఉంటాయి. కట్టర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి; ఈ పని పిల్లలకు అప్పగించవద్దు. ఇక్కడే ఈ పెట్టె అసలైన కిచెన్ ఆర్గనైజర్గా మారబోతోంది. పెట్టె పొడవు, వెడల్పు కొలిచి, మిగిలిన అట్ట ముక్కలతో కొన్ని పొడవాటి పీసెస్ను కట్ చేసుకోండి. ఒక పొడవాటి అట్టను పెట్టె మధ్యలో నిలువుగా అమర్చండి. ఆ తర్వాత, రెండు లేదా మూడు చిన్న అట్టలను అడ్డంగా పెట్టండి. ఇప్పుడు పెట్టెలో నాలుగు, ఆరు లేదా అంతకంటే ఎక్కువ చిన్న గదులు ఏర్పడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: అన్ని అరలు ఒకే సైజులో ఉండాల్సిన అవసరం లేదు. సాస్ ప్యాకెట్ల కోసం ఒక చిన్న అర, మసాలా ప్యాకెట్ల కోసం కొంచెం వెడల్పైన అర, పొడవాటి స్పూన్ల

హైదరాబాద్ శంషాబాద్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్: నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా చలామణి చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా? నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్ సైబరాబాద్ పరిధిలో 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోని ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొంది.. ఈపీఎఫ్ చట్టం ప్రకారం.. అధికారిక మినహాయింపు ఉత్తర్వులు లేని పీఎఫ్ ట్రస్టుల కోసం వన్ టైమ్ పరిష్కార పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ట్రస్టులు తమ మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించేందుకు డిసెంబర్ 28వ తేదీ వరకు గడువును విధించింది. ఈ మరకు 2026 జూన్ 29న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద గుర్తింపు ఉండి.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని సెక్షన్ 17 లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు లేని పీఎఫ్ ట్రస్టులకు ఈ ఆమ్నేస్టీ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పరివర్తన చర్యగా.. 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలతో ఈపీఎఫ్ఓ 2026 జులై 11న ఒక సర్య్కులర్ కూడా జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ట్రస్టులు తమ హోదాను గడిచిన కాలానికి వర్తించే విధంగా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో నిర్దేశించిన పలు నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా కనీస ఉద్యోగుల సంఖ్య, కనీస కార్పస్ పరిమాణం, 3ఏళ్ల

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి. మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి. గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి. నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్

కన్నడ స్టార్ నటుడు, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ తన పుట్టినరోజున అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న భారీ చారిత్రక చిత్రానికి 'దేవరాయ' అనే టైటిల్ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్తో కూడిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో సుదీప్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రాజసంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా సుదీప్ తన సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో ద్వారా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టైటిల్ వీడియోలో సుదీప్ లుక్ అత్యంత గంభీరంగా, రాజసం ఉట్టిపడేలా ఉంది. తలపై కిరీటం, మెడలో ముత్యాల హారాలు, ఇతర రాజాభరణాలతో ఆయన ఆహార్యం ఆకట్టుకుంటోంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం ఈ వీడియోకు మరింత బలాన్ని చేకూర్చింది."చరిత్రను మలుపుతిప్పిన సామ్రాజ్యం, ఒక శకాన్ని నిర్మించిన రాజు, కాలానికి అతీతంగా నిలిచిన లెజెండ్" అనే శక్తివంతమైన వాక్యాలతో చిత్ర బృందం 'దేవరాయ' పాత్రను పరిచయం చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీకృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్ఠలకు అద్దం పడుతున్నాయి. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే సుదీప్, ఈ చారిత్రక పాత్ర కోసం అద్భుతంగా రూపాంతరం చెందారని ఫస్ట్ లుక్ను చూస్తేనే అర్థమవుతోంది.ఈ భారీ చారిత్రక చిత్రాన్ని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి

ఇంటికి అడుగుల దూరంలోనే.. ఒక్కసారిగా పిడుగు పడి ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ భయానక క్షణాలు ఇంటి డోర్బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్లో జరిగిన ఈ ఘటనలో థామస్ ఫహ్మీ ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన శరీరమంతా ఒక్కసారిగా తీవ్రమైన విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించిందని.. మొద్దుబారడం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు. స్టాటెన్ ఐలాండ్లో నివసించే థామస్ ఫహ్మీ గత గురువారం దంత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు తన ఇంటి నుంచి కారువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. విండ్సర్ రోడ్ సమీపంలో తన కారుకు సుమారు 15 నుంచి 25 అడుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఆయన పాదానికి పిడుగు తాకింది. డోర్బెల్ కెమెరాలో నమోదైన వీడియోలో పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ నేలపై పడిపోవడం కనిపించింది. అయితే ఆయన స్పృహ కోల్పోలేదు. తన శరీరమంతా తీవ్రమైన షాక్కు గురైనట్లు, ముఖ్యంగా రెండు పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట మొద్దుబారినట్లు ఫహ్మీ చెప్పారు. పిడుగు ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఫహ్మీ తిరిగి లేచి.. సహాయం కోసం సమీపంలోని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లారు. నాకు సాయం చేయండనే0 అరుపు వినిపించింది. వెంటనే నా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన నేలపై పడి ఉన్నారని పొరుగింటి మహిళ స్టెఫానీ హోమన్ తెలిపారు. అనంతరం ఫహ్మీని నార్త్వెల్ స్టాటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరుసటి రోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఆయనకు ఎలాంటి కాలిన గాయాలు లేవని వైద్యులు గుర్తించారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి

తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు ఛాన్స్ రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్ ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. మొబైల్తోనే రేషన్ ఇ-కేవైసీ Ration Card Update : తెలంగాణ రేషన్ కార్డుదారులు ఎగిరిగంతేసే వార్త.. రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ భారీ ఊరటనిచ్చింది. గడువు తేదీలోగా ఒకేసారి 3 నెలలకు రేషన్ బియ్యం పొందలేని వారికి మరో ఛాన్స్.. ఆగస్టు 31తో ముగిసిన ఈ గడువును సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ బియ్యం పంపిణీకి ఆగస్టు 31 చివరి తేదీ కాగా, వర్షాలు, పండుగల రద్దీ, లబ్ధిదారులు సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలతో ఈ గడువును మరింత పెంచింది. ఈసారి విడతలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తీసుకోవచ్చు. గత ఆగస్టులో 3 నెలల బియ్యం పంపిణీ ప్రారంభం కాగా రద్దీ, ఇతర కారణాలతో రేషన్ తీసుకోలేకపోయారు. అర్హులైన కుటుంబాలకు ఈ పొడిగింపు చాలా రిలీఫ్. ఎలాగో పెంచారు కదా అని ఆలస్యం చేయొద్దు.. రేషన్ కార్డుదారులు లాస్ట్ డేట్ వరకు వేచి ఉండొద్దు. మీకు దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవడం బెటర్. Read Also : Air Marshal Jeetendra Mishra : అయోధ్య రామ మందిర ఫస్ట్ CEO ఇతడే.. జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే! మొబైల్తో e-KYC ఎలా? : రేషన్ కార్డు e-KYC ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బెనిఫిట్స్ అందేలా ఈ ప్రాసెస్ నడుస్తోంది. కానీ, ఇప్పటిరవకూ రేషన్ షాపులో e-POS మిషన్ ద్వారా ఫింగర్ ఫ్రింట్ కేవైసీ చేసుకునే వీలుంది. ఇకపై రద్దీ కారణంగా

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్లు

భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా యార్క్షైర్తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కాగా కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్షైర్ బ్యాటింగ్కు దిగింది. రంజీల్లో దుమ్ములేపాడు జమ్మూ కశ్మీర్కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు. కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్లో న్యూజిలాండ్తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్లో బౌన్సీ పిచ్లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్షైర్తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్రౌండర్ మహిపాల్ లామ్రోర్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని కోరారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని కేంద్రమంత్రికి.. సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో రన్ వే ఫైనలైజ్కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఆ పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ తెలిపారు. తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్కు.. సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగర్లో సీ ప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర

రైల్వే సీట్లు, బెర్త్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీట్లు, బెర్త్లు నీలం రంగులో ఉండటాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే రైల్వే సీట్లకు నీలం రంగునే ఎందుకు ఎంచుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని కలర్ సైకాలజీలో చెబుతారు. నీలం రంగును సాధారణంగా ప్రశాంతత, స్థిరత్వంతో అనుసంధానిస్తారు. ఆకాశం, సముద్రం వంటి విశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు ప్రయాణించే సమయంలో నీలం వంటి ప్రశాంతమైన రంగు కంటికి సౌకర్యంగా అనిపించవచ్చని భావిస్తారు. రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీట్లు, బెర్త్లపై దుమ్ము, చిన్నపాటి మరకలు పడటం సహజం. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు ఉపరితలంపై కొన్ని రకాల మరకలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సీట్లు తరచూ మురికిగా కనిపించకుండా ఉండటానికి ఈ రంగు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సుదూర రైలు ప్రయాణాలు గంటల తరబడి సాగుతాయి. కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోచ్లోని రంగులు, వెలుతురు, శబ్దం వంటి అంశాలు ప్రయాణికుల అనుభూతిపై ప్రభావం చూపవచ్చు. నీలం రంగు సాధారణంగా కంటికి ప్రశాంతంగా కనిపించే రంగుల్లో ఒకటిగా భావిస్తారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tiger suddenly attacks on zookeeper video: సాధారణంగా జూలల్లో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని శాఖాహర జంతువులు, మరికొన్ని మాంసాహర జంతువులు ఉంటాయి. అయితే.. జూ సిబ్బంది వాటికి చక్కగా ట్రైన్ చేస్తారు. క్రూర జంతువులను సైతం తమ దారిలో తెచ్చుకుంటాయి. ఆ తర్వాత అవి జూ సిబ్బంది చెప్పినట్లు వింటాయి. కానీ కొన్నిసార్లు జూలోని జంతువులు సిబ్బందిపై ఎదురు తిరిగి దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో జూ సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోతారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక జూ ఎన్ క్లోజర్ లో పెద్దపులి జూ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసింది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో.. ఎన్ క్లోజర్ లో కొన్ని పెద్దపులులు ఉన్నాయి. ఇంతలో వాటిని ఆహరం వేద్దామని నెమ్మదిగా జూ సిబ్బంది దానిలోకి ప్రవేశించాడు. మరీ దానికి ఏమనిపించిందో ఏంటో కానీ ఒక్కసారిగా పెద్దపులి జూ కీపర్ పై దాడి చేసింది. ఈ ఘటనతో అతను షాక్ కు గురయ్యాడు. పులి అతని మెడను గట్టిగా పట్టుకుని పలు మార్లు తన పంజాతో దాడి చేసింది. ఇంతలో అక్కడున్న జూ కీపర్ పెంపుడు శునకం పెద్దపులిపై దాడికి దిగింది. దీంతో పులి కాస్త జూ కీపర్ ను వదిలేసింది. ఆ పెనుగులాటలో మరో జూ కీపర్ చాకచక్యంగా ప్రవర్తించి, గాయపడ్డ సిబ్బందిని బైటకు లాక్కున్నాడు. కుక్క మాత్రం పులితో పొరాటంకు దిగింది. Read more: Snake

ఢిల్లీ వేదికగా కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తన పైన హైకమాండ్ చర్యలకు సిద్దం అవుతున్న వేళ కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ తో అమీ తుమీకి సిద్దం అయ్యారు. తన పైన చర్యలు తీసుకునే ముందే రేవంత్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ చీఫ్ ఖార్గేతో భేటీ అయిన కొండా ఆ తరువాత ఈ వ్యాఖ్యలు చేసారు. బీసీ కార్డు తెర మీదకు తీసుకొచ్చారు. తన పైన వేటు వేస్తే ఆ వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలతోనూ సురేఖ సిద్దం అయినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ ఢిల్లీ కేంద్రంగా మరో సంచలనానికి కారణమయ్యారు. సీఎం రేవంత్ తో పాటుగా కేబినెట్ మంత్రులను టార్గెట్ చేసారు. తాను తప్పు చేయలేదని.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను బాధ్యత ఎలా వహిస్తానని ప్రశ్నిస్తున్నారు. తనకు అసలు నోటీసులు ఇవ్వటమే తప్పు అని తేల్చి చెప్పారు. రాహుల్ పదే పదే మహిళలు స్వతంత్రంగా బతకాలని చెబుతూ ఉంటారని.. ఇప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బీసీ అయిన తన పైనే చర్యలు ఉంటాయా.. రేవంత్ పైన వ్యాఖ్యలు చేస్తన్న ఇతర వర్గాలకు చెందిన వారి పైన ఉండవా అంటూ ప్రశ్నించారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా చెబుతారని సురేఖ నిలదీసారు. పరకాల సీటు రేవంత్ ఎలా ప్రకటిస్తారని.. ఇది క్రమశిక్షణా రాహిత్యం కింద కు రాదా అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెబుతున్న రేవంత్ పైన ర్యలు ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు.నా కంటే ముందు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి - ఢిల్లీలో సురేఖ సంచలనం..!!వేటు వేస్తే ఆ వెంటనే.. యాక్షన్ ప్లాన్ సిద్దంతన బిడ్డ ను రెచ్చగొడితే స్పందించిందని .. ఇదే విషయాన్ని తాను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కు లేఖ ద్వారా వివరించానని చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే సమయంలో కొండా సురేఖ తనతో

ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించే భారీ ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadhu Lohar) కూడా ఈ లిస్ట్ లో ఒకరు. తాజాగా ఆమె కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కయాదు సాంప్రదాయంగా గోల్డెన్ కలర్ లంగా వోణీ ధరించి డిఫరెంట్ స్టైల్ లో జడ వేసుకుని, అవుట్ఫిట్ కు తగ్గ జ్యువెలరీతో మరింత అందంగా మెరిసింది. ఈ ఫోటోల్లో కయాదుని చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు

రిటైర్ అయిన తరువాత ఏం చేయాలి? కాలక్షేపం ఎలా? మరీ ముఖ్యంగా డబ్బులు ఎలా మధనపడే వారికి కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ రేమాబాయి జీవితం స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆమె చేశారు? తెలుసుకుందాం ఈ కథనంలో. కేరళలోని కొల్లమ్కు చెందిన రేమాబాయి జువాలజీ టీచర్గా,హెడ్మిస్ట్రెస్గా 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సేవలందించారు. 2022 మే 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆమె భర్త, ఒక రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్. అలాగే సర్జన్లైన ఆమె కుమారుడు, కోడలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఏడాది తల్లి మరణం, ఒంటరితనం వల్ల ఏర్పడిన మానసిక వేదనను జయించడానికి ఆమె తన ఇంటి పెరటి స్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు. దీని మీద బాగా పరిశోధించి 'మలేషియన్ కింగ్' (Malaysian King) రకానికి చెందిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకున్నారు. కేవలం 1,750 చదరపు అడుగుల పెరటి స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలు, పాత టైర్ల సాయంతో 360 మొక్కలతో సాగు ప్రారంభించారు. ప్రారంభంలో 360 మొక్కలు నెలకు రూ. 50వేలకు మించి ఆదాయాన్ని అందించగా,ఆ తరువాత ఆదాయం సుమారు రూ. 1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫలితాలు, మరింత భూమి కొనకుండానే తన సాగును విస్తరించడానికి ఆమెను ప్రోత్సహించాయి. ఫలితంగా నెలకు రూ. 4 లక్షలు ఆర్జించేస్థాయికి చేరుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ -మిద్దెతోట మిద్దెపై మట్టిలేని సాగు (Soil-less Cultivation): పెరట్లోనే కాకుండా తన ఇంటి మిద్దెపై (Terrace) బరువు కాకుండా ఉండటానికి మట్టికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్, ఆవు పేడను డ్రమ్ములు/బారెళ్లలో నింపి మొక్కలను పెంచడం ప్రారంభించారు. సేంద్రీయ పద్ధదితో ఆమె సక్సెస్ను అందుకోవడం విశేషం. పాత వంటగది వ్యర్థాలు, ఆకులు, కొబ్బరి/పనస వ్యర్థాలు మరియు చేపల వ్యర్థాలతో ఫ్రిష్ అమినో యాసిడ్స్ వంటి 15 రకాల ద్రవ ఎరువులను తయారు చేసి