
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహాశక్తి’ సినిమా టీజర్ విడుదలైంది. ‘మూకుత్తి అమ్మన్ 2’ తెలుగు టైటిల్గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘Rise of Mahasakthi’ టీజర్ను విడుదల చేశారు. ఇందులో నయనతార దేవతా రూపంలో శక్తివంతమైన అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. టీజర్లో గ్రామంపైకి వచ్చే శత్రువులు, రక్షణ కోసం జరిగే పోరాటం, దైవశక్తి ఆవిర్భావం వంటి అంశాలను చూపించారు. నయనతార అమ్మవారి పాత్రలో బలమైన స్క్రీన్ ప్రెజెన్స్తో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మహాశక్తిగా నయనతార ప్రత్యేక అవతారం ‘మహాశక్తి’లో దైవశక్తి, హాస్యం, యాక్షన్ అంశాలను కలిపి రూపొందిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హిప్హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. విజువల్స్ పరంగా భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో నయనతారతో పాటు దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, ఊర్వశి, యోగి బాబు, అభినయ, గరుడ రామ్, సింగంపులి తదితరులు నటిస్తున్నారు. నవంబర్ 6న విడుదలకు సన్నాహాలు ‘మహాశక్తి’ను నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీపావళి సీజన్ను టార్గెట్ చేస్తూ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ‘మహాశక్తి’ పేరుతో రానున్న ఈ సినిమా తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’గా విడుదల కానుంది. నిర్మాతగా డాక్టర్ ఇషారి కె. గణేష్ వ్యవహరిస్తుండగా, ఖుష్బు సుందర్, కుష్మిత గణేష్, ఇషాన్ సక్సేనా, విఘ్నేష్ శివన్ సహ నిర్మాతలుగా ఉన్నారు. మూకుత్తి అమ్మన్ ఫ్రాంచైజీలో కొత్త కథ 2020లో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం ప్రకటించినప్పటికీ, ప్రత్యేక కథతో రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మొదటి భాగంలో నయనతార అమ్మవారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండో భాగంలో సుందర్ సి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దైవశక్తి, యాక్షన్, వినోదం కలయికతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నారు. టీజర్ విడుదలతో ‘మహాశక్తి’పై అంచనాలు పెరిగాయి. నయనతార కొత్త అవతారం, భారీ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.