
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. తొలి రోజే మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్లో ఈ చిత్రాన్ని వీక్షించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు పోస్ట్ చేశారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్, యూత్ కలలను అద్భుతంగా ఆవిష్కరించారంటూ ‘ఎపిక్’ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.
Tags:#epic
Found this helpful?
Share this story with your network
